యధేచ్చగా ఇసుక దందా నిద్రమత్తులో అధికారులు

563చూసినవారు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల పరిధిలోని ఈసీ వాగులో యధేచ్చగా ఇసుకాసురులు ఇసుక దందాలు నిర్వహిస్తున్నారు. ఈసీ నదిలో నుంచి తీసిన ఇసుకను పక్కనే డంపింగ్ చేసి యధేచ్ఛగా అమ్మేస్తున్నారు. అధికారులు మాత్రం చూసి చూడనట్టు ఉండిపోతున్నారు. వెంటనే ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని శనివారం మీడియా ముఖంగా ప్రజలు కోరుతున్నారు. అధికారులు తెలిసి ఇలా చేస్తున్నారా? తెలియక చేస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్