రంగారెడ్డి: అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డిపై ఏసీబీ కేసు

68చూసినవారు
రంగారెడ్డి: అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డిపై ఏసీబీ కేసు
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి ఇంట్లో మంగళవారం ఏసీబీ సోదాలు చేశారు. భూపాల్‌రెడ్డికి సంబంధించిన ఐదు చోట్ల తనిఖీలు చేయగా రూ.40 కోట్ల వరకు అక్రమాస్తులు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అంతేకాదు.. బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. భూపాల్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్