బడికెళ్లడానికి బస్సు వేయండి సారూ..

55చూసినవారు
బడికెళ్లడానికి బస్సు వేయండి సారూ..
శంకర్పల్లి మండలం అంతప్పగూడెం గ్రామ విద్యార్థులు. 8 కి.మీ. దూరంలో ఉన్న పర్వేదలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు ఇక్కడి నుంచి నిత్యం 30మంది ఇలా సరకు రవాణా ఆటోలో వెళుతున్నారు. కరోనా సమయంలో గ్రామానికి రద్దు చేసిన బస్సును ఇప్పటి వరకు పునరుద్ధరించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణం ప్రమాదభరితమే కాకుండా ఒక్కో విద్యార్థికి రూ.1000 ఖర్చవుతోందని తల్లిదండ్రులు తెలిపారు.

సంబంధిత పోస్ట్