ఎంఈఓలను నియమించడం హర్షనీయం!

54చూసినవారు
ఎంఈఓలను నియమించడం హర్షనీయం!
విద్యావ్యవస్థలో ఇన్ ఛార్జ్ ఎంఈఓలతో పర్యవేక్షణ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నూతన ఎంఈఓల నియామకం చేపట్టింది. దీంట్లో భాగంగా మద్దూరు మండలానికి పెదిరిపాడ్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బాల కిష్టప్పను, కొత్తపల్లి నూతన మండలానికి నిడిజింత ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులును నియమించారు. వీరి నియామకంతో విద్యావ్యవస్థ మెరుగుపడుతుందని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్