త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి, ఆ పార్టీ జెండాను ఎగురవేయడం ఖాయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన అభ్యర్థి లక్ష్మారెడ్డితో కలిసి చంపాపేట డివిజన్ లోని కటకోనికుంట, హరిజన బస్తీ, మహంకాళమ్మతోట, కుమ్మరి బస్తీల్లో ఇంటింటికీ వెళ్లి కారు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు.