వేసవి కాలంలో చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడతాయని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ అన్నారు. డివిజన్ పరిధిలోని నాగోల్ ప్రధాన రోడ్డులో విజేత రిందా మెడోస్ అపార్ట్మెంట్ లో ఆదివారం బాటసారులు, స్థానికులకు మజ్జిగ పంపిణీ చేశారు. కార్పొరేటర్ ముఖ్యఅతిథిగా హాజరై మజ్జిగ పంపిణీని ప్రారంభించారు. ఎండల తీవ్రతతో అవస్థలు పడుతున్న ప్రజలకు ఉప శమనం కలిగించేందుకు చల్లటి మజ్జిగను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.