అనాధ పిల్లలకు బుక్స్, స్టేషనరీ పంపిణీ

566చూసినవారు
నాగోల్‌లోని లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్ బాలికల వసతి గృహంలో యూఎస్‌లో స్థిరపడ్డ తెలంగాణ యువకుడు ఆలూరి శశివర్ధన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను తన స్నేహితులు అనాధ పిల్లలతో కలిసి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాలన వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌కు బియ్యపు సంచులు , అనాధ పిల్లలకు బుక్స్, స్టేషనరీ, అరటి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్, మహేష్ గౌడ్, అభిషేక్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్