మృతి చెందిన డ్రైవర్ ల కుటుంబాలకు తోటి డ్రైవర్ల ఆర్థిక సహాయం...

348చూసినవారు
మృతి చెందిన డ్రైవర్ ల కుటుంబాలకు తోటి డ్రైవర్ల ఆర్థిక సహాయం...
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోటి డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకొని టాక్సీ డ్రైవర్లు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ విజయవాడ వైపు నడిచే టాక్స్ డ్రైవర్లు యాదాద్రి కార్ టాక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోటి డ్రైవర్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ నగదు మొత్తాన్ని వారి పిల్లల పేర్లపై డిపాజిట్ చేసి పాసుబుక్కులను కుటుంబ సభ్యులకు సీనియర్ నాయకులు రామ్మోహన్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ డ్రైవర్లు ఓనర్లు సంఘటితంగా ఉండి అంత ఓ కుటుంబంలో చూసుకొని ముందుకు వెళితే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఈరోజు తోటి డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం చాలా గొప్ప విషయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భీమనపల్లి కనకయ్య, ఉప్పలయ్య, జైలో శ్రీను, సురేష్, యాదయ్య, నాగిరెడ్డి, ఎర్ర ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్