గంజాయి స్థావరంపై పోలీసుల దాడులు

655చూసినవారు
గంజాయి స్థావరంపై పోలీసుల దాడులు
మేడ్చల్ జిల్లా రాంపల్లిలోని బీరప్ప గుడి సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్న స్థావరంపై శుక్రవారం విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన ఎస్. ఓ. టి పోలీసులు. ఈ దాడిలో దాదాపు రెండు కిలోల గంజాయి మరియు ఒక ద్విచక్ర వాహనం, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. గంజాయి విలువ సుమారుగా లక్ష రూపాయలు ఉంటుంది అని అంచనా. నిందితులు లోకేష్, సాయి శంకర్, మధు మోహన్, కిరణ్, మోహన్ లు పట్టుబడ్డారు.నిందితులను కేసు నమోదు చేసి కీసర పోలీసులకు అప్పగించిన ఎల్. బి. నగర్ ఎస్. ఓ. టి బృందం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్