మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: డీసీపీ

59చూసినవారు
విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని, వాటికి దూరంగా ఉండాలని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్ అన్నారు. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పీపీ నర్సింహారావు వెటర్నరీ కాలేజీలో బుధవారం ప్రపంచ డ్రగ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. జీవితంలో మత్తు పదార్థాల జోలికి వెళ్ల బోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

సంబంధిత పోస్ట్