లాంగ్ డ్రైవ్ కోసమని కార్లను అద్దెకు తీసుకుని అమ్ముకుంటూ సొమ్ముచేసుకుంటున్న నిందితులను మాదాపూర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం. ఆదిలాబాద్ జిల్లా రామగుండంకు చెందిన హరీష్ కుమార్ కుందారపు, మడెల్ల అభిషేక్, ఎల్కపల్లి కోమలేశ్వర్, ఏలూరి ప్రేమ్ కుమార్ లు ముఠాగా ఏర్పడి లాంగ్ డ్రైవ్ కార్లను లీజుకు తీసుకుని అమ్ముకుంటున్నట్లు తెలిపారు.