మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం చల్లా వంశీచంద్ రెడ్డి దంపతులు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లు తెలియజేశారు. శనివారం శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పుణ్య దర్శనానంతరం దైవ ప్రసాదం స్వీకరించినట్లు తెలిపారు. మహబూబ్ నగర్ ఎంపీగా విజయానికి పవిత్ర ఆశీర్వచనం వేదపండితులు అందజేసినట్లు షాద్నగర్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.