మహబూబ్ నగర్ పార్లమెంటుఅభ్యర్థి వంశీ చంద్ రెడ్డి గెలుపు కోసం గురువారం షాద్నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెలిజర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతూ ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.