రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

82చూసినవారు
రోడ్డు పనుల్లో నాణ్యత చేపట్టి ఒక క్రమ పద్ధతిలో రహదారి విస్తరణ పనులు జరగాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులకు సూచించారు. సోమవారం షాద్ నగర్ పట్టణంలోని ఓల్డ్ హైవేలో రోడ్డు విస్తరణ పనులలో భాగంగా మిషన్ భగీరథ పైపులైను రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. భవిష్యత్తులో రోడ్డు పనులకు రాకపోకల సౌకర్యాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పూర్తి చర్యలు చేపట్టాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్