షాద్నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని బొదునంపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు గత పాలకులను వేడుకున్న కనికరించలేదు. ఈ విషయాన్ని ఎన్నికల ముందు గ్రామ ప్రజలు శంకర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అయన గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రామానికి బస్సు రావడంతో గ్రామస్తులు ఆనందోత్సవంతో ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.