ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పాస్టర్ బాజిందర్ సింగ్ దోషిగి తేలాడు. బాజిందర్ సింగ్ పంజాబ్ లోని ఓ చర్చిలో పాస్టర్ గా పనిచేస్తున్నారు. విదేశాలకు తీసుకెళ్తానని మాయమాటలు చెప్పి బాజిందర్ తనను శారీరకంగా వాడుకున్నాడని ఓ మహిళ ఆరోపించడంతో 2018లో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు బాజిందర్ సింగ్ను తాజాగా దోషిగా తేల్చింది. ఏప్రిల్ 1న శిక్షను ఖరారు చేయనున్నట్లు తెలిపింది.