రూ.2 వేల నోట్ల‌పై RBI కీల‌క ప్ర‌క‌ట‌న

328996చూసినవారు
రూ.2 వేల నోట్ల‌పై RBI కీల‌క ప్ర‌క‌ట‌న
రూ.2 వేల నోట్ల మార్పిడిపై RBI కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పోస్టాఫీసుల ద్వారా రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. ఆన్‌లైన్‌లో ల‌భించే ద‌ర‌ఖాస్తు ఫారంను నింపి.. పోస్టాఫీసుల ద్వారా తమ 19 ఇష్యూ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపాలని తెలిపింది. కాగా, రూ.2 వేల నోట్ల మార్పిడి/డిపాజిట్ చేసేందుకు ప్రజలు RBI కార్యాలయాల వద్ద బారులు తీరుతున్న నేపథ్యంలో తాజా ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

సంబంధిత పోస్ట్