కరువు నిధులు పంపిణీ చేయకుండా మొండిచేయి

561చూసినవారు
కరువు నిధులు పంపిణీ చేయకుండా మొండిచేయి
వైసీపీ పాలనలో విపత్తుల నిర్వహణ వ్యవస్థ కూడా ధ్వంసమైంది. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని నిర్దేశిత పనులకు కాకుండా. ఇష్టారాజ్యంగా దారి మళ్లించారు. కరోనా సమయంలో వచ్చిన సొమ్మునూ పక్కదారి పట్టించారు. మొత్తంగా విపత్తుల నిర్వహణను ప్రశ్నార్థకం చేశారు. అయిదేళ్ల పాటు రోడ్ల నిర్వహణను అటకెక్కించిన వైసీపీ సర్కారు. ఎన్నికల షెడ్యూలుకు ముందు మరమ్మతుల పేరిట హడావుడిగా రూ.1,228 కోట్ల నిధుల్ని విడుదల చేసింది. కరవు నిధుల్ని అన్నదాతలకు పంపిణీ చేయకుండా మొండిచేయి చూపింది.

సంబంధిత పోస్ట్