ఈనెల 18న అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ప్రాథమిక సమావేశం నిర్వహించి కార్యక్రమం ప్రారంభించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జులై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనున్నారు. అనంతరం పలు దశల్లో పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువలను ఖరారుచేస్తారు. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన తర్వాత ఆగస్టు నుంచి నూతన మార్కెట్ విలువలు అమలు చేస్తారు.