రెమాల్ తుపాను ప్రభావం వల్ల పెనుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ పరిశోధనా సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కొల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం ఆర్ధ రాత్రి నుండి సోమవారం ఉదయం 9 గంటల వరకు మూసివేయనున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. తీరాన్ని దాటే అవకాశం ఉన్నందున ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బెంగాల్ రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.