కేంద్ర మంత్రి పదవికి ఆర్ఎల్జేపీ అధ్యక్షుడు పశుపతి కుమార్ పరాస్ మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి ఆయన పంపించారు. పాట్నాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. బీహార్లో 40 లోక్సభ సీట్లను NDA సోమవారం ప్రకటించింది. చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 5 సీట్లు కేటాయించారు. తమకు సీట్లు కేటాయించకపోవడంతో పశుపతి పరాస్ ఆవేదనతో NDA నుంచి సైతం వైదొలిగారు.