'గుంపు మేస్త్రి కంటే అధ్వాన్నంగా రేవంత్ పాలన'

62చూసినవారు
'గుంపు మేస్త్రి కంటే అధ్వాన్నంగా రేవంత్  పాలన'
రేవంత్ రెడ్డి పాలన గుంపు మేస్త్రి కంటే అధ్వాన్నంగా ఉందని బీజేపీ నేత రఘునందన్‌ రావు అన్నారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సందిగ్ధంలో ఉందన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వడం కాంగ్రెస్ కు అలవాటన్నారు. ఈ జిల్లాలో సన్న బియ్యం ఎంతో.. దొడ్డు బియ్యం ఎంతో భట్టి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్