రైల్లో దోపిడీ.. సినిమా రేంజ్‌లో భారీ చోరీ

69చూసినవారు
రైల్లో దోపిడీ.. సినిమా రేంజ్‌లో భారీ చోరీ
జనగామ జిల్లా చిల్పూర్ మండ‌లంలోని నష్కల్-పెండియాల్ మ‌ధ్యలో బుధ‌వారం అర్ధరాత్రి రైలులో భారీ దోపిడీ జ‌రిగింది. రైలు ర‌న్నింగ్‌లో ఉండ‌గా ట్రాక్ ప‌క్కనే నిల్చున్న సుమారు 20 మంది దొంగ‌ల ముఠా ప్రయాణికుల మెడ‌ల్లోంచి బంగారు ఆభ‌ర‌ణాల‌ను లాక్కుని ప‌రార‌య్యారు. నాగర్ సోల్ నుంచి నర్సాపూర్ వెళ్తున్న ఎక్స్ ప్రెస్ లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో భారీ మొత్తంలో బంగారాన్ని దోపిడీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ ఏసీపీ భీమ్‌శ‌ర్మ, కాజీపేట రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్