మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం

50చూసినవారు
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం
తమిళనాడు కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం స్టాలిన్ గురువారం ప్రకటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా కల్తీ మద్యం తాగిన వారిలో ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. మరో 70 మంది చికిత్స పొందుతున్నారు.

సంబంధిత పోస్ట్