TG: యూరప్లో ఉద్యోగాల పేరిట రూ.5 కోట్లు కాజేసిన ముఠాను HYD పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని దాదాపు 100 మందిని నిందితులు కొట్టు సాయి రవితేజ, కొట్టు మనోజ్ మోసం చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ ముఠాలో మొత్తం ఆరుగురిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలో ఈ ముఠా బ్రాంచ్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులను మోసం చేసినట్టు దర్యాప్తులో తేలింది.