విద్యుత్ షాక్ తగిలి ఆవు మృతి

1066చూసినవారు
విద్యుత్ షాక్ తగిలి ఆవు మృతి
కంగ్టి మండల పరిధిలోని ముకుంద్ నాయక్ తాండాకు చెందిన పరుశురాం రైతుకు చెందిన ఆవు మంగళవారం విద్యుత్ షాకుతో మరణించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరుశురాంకు చెందిన ఆవు మేత మేయడానికి పొలం గట్ల వెంట వెళ్తుండగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ తీగలు తగిలి అక్కడికక్కడే మరణించింది. మరణించిన ఆవు విలువ సుమారు 60 వేల రూపాయలు ఉంటుందని పరుశురాం తెలిపాడు. తనకు ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్