ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే రోజు 35 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. మార్చి నుంచి మే వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ముఖ్యంగా వేడి తీవ్రత గత ఏడాది కంటే ఈసారి అధికంగా ఉంటాయని అంటున్నారు. జనాలు మిట్ట మధ్యాహ్నం సమయంలో ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.