ఓటేసిన బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని ఆయన కోరారు.