మండలంలో మళ్లీ పెరిగిన ఉష్ణోగ్రతలు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో మళ్లీ ఉష్ణోగ్రతలు దడ పుట్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోగా గురువారం ఒక్కసారిగా 35 డిగ్రీల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దీంతో వేడిగాలులు ఎండ తీవ్రత హెచ్చుగా పెరిగింది. జనాలు లేక ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ఎండ తీవ్రతకు మండల ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.