సంగారెడ్డి పట్టణం సోమేశ్వర వాడలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రాత్రి హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు గంటపాటు నిర్వాహకులు రఘు గురుస్వామి ఆధ్వర్యంలో 11 సార్లు హనుమాన్ చాలీసాలు చదివారు. అనంతరం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలను జరిపించారు.