హైడ్రా పేరుతో అక్రమవస్తులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

79చూసినవారు
జిల్లాలో ఎవరైనా హైడ్రా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపేష్ హెచ్చరించారు. సంగారెడ్డి లోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమీన్ పూర్ చెరువు సమీపంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఓ వ్యక్తి బిల్డర్లను బెదిరించినట్లు పేర్కొన్నారు. విప్లవ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. హైడ్రా పేరుతో బెదిరిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్