అదానీ, హిండెన్బర్గ్ కేసులో నేడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై వ్యాపారవేత్త గౌతమ్
అదానీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సత్యం గెలిచిందన్నారు. సత్యమేవ జయతే.. ఈ కఠిన సమయాల్లో మాకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు. దేశ అభివృద్ధి కథలో మన సహకార కథ కొనసాగనుంది. జై హింద్అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.