ఉగ్రవాదిని కాల్చి చంపిన భద్రతా దళాలు

66చూసినవారు
ఉగ్రవాదిని కాల్చి చంపిన భద్రతా దళాలు
జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లా సైదా సుఖల్ గ్రామంలో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఒక ఉగ్రవాదిని కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి 7.45 గంటల సమయంలో అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు కనిపించారన్నారు. దీంతో భద్రతా బలగాలు గ్రామానికి చేరుకున్నాయన్నారు. ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడన్నారు. ఇతర ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్