హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు

79428చూసినవారు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఒత్తిడితోనే నార్సింగిలో 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చానని శివబాలకృష్ణ చెప్పారు. కేసు దర్యాప్తుపై ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. బాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్రపై నివేదిక అందజేశారు. అరవింద్ ను విచారించేందుకు ప్రభుత్వాన్ని ఏసీబీ అధికారులు అనుమతి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్