గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో రెండో రోజు కొనసాగిన విచారణ కొనసాగింది. ఈమేరకు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అధికారి రాంచందర్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసులో రాంచందర్ను ఇటీవల అరెస్టు చేసిన ఏసీబీ.. రెండో రోజు పశుగణాభివృద్ధి సంస్థ మాజీ సీఈవో రాంచందర్ నాయక్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్, ఓఎస్డీ కల్యాణ్ కుమార్ను విచారించింది. గొర్రెల పంపిణీ పథకంలో కాస్ట్ పెంపుదల, నిధుల మళ్లింపు అంశాలపై ఇద్దరిని విచారించింది. బుధవారం నిందితులిద్దరిని ఏసీబీ మరోసారి ప్రశ్నించనుంది.