ఐపీఎల్ 2025 భాగంగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ సాధించారు. ఐపీఎల్లో పంజాబ్ తరఫున కెప్టెన్గా ఆడుతున్న మొదటి మ్యాచ్లో 27 బంతుల్లో శ్రేయాస్ 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఆరంభం నుంచే గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడుతూ శ్రేయాస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీంతో 13 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ స్కోర్ 139/4గా ఉంది. శ్రేయాస్(57), స్టోయినిస్(6) క్రీజులో ఉన్నారు.