భార్యను వేధించిన కేసులో ఓ ఎస్ఐకి జైలు శిక్ష పడింది. తూ.గో జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన శిరీషతో హైదరాబాద్లో ఎస్ఐగా పనిచేస్తున్న తణుకుకు చెందిన మల్లుల సతీశ్ కుమార్కు 2014లో వివాహమైంది. అధనపు కట్నం కోసం భార్యను వేధించడంతో శిరీష రాజమహేంద్రవరం పోలీసులను ఆశ్రయించింది. కేసు విచారించిన దిగువ కోర్టు 2018లో సతీశ్కి ఐదేళ్లు, అతడి తల్లికి రెండేళ్ల జైలు శిక్ష వేసింది. దీంతో సతీశ్ రాజమహేంద్రవరంలోని పదో అదనపు జిల్లా కోర్టును ఆశ్రయించాడు. మంగళవారం వాదోపవాదాలు విన్న కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.