దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం ఆద్యంతం ఒడుడొడుకులు ఎదుర్కొన్నప్పటికీ చివరకు లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 72,220.57 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 72,099-72,730 మధ్య చలించిన సూచీ.. చివరికి 195.42 పాయింట్ల లాభంతో 72,500.30 వద్ద ముగిసింది. నిఫ్టీ 31.65 పాయింట్ల లాభంతో 21,982.80 వద్ద స్థిరపడింది. పవర్గ్రిడ్ కార్పొరేషన్, టైటాన్, ఏషియన్ పెయింట్స్ షేర్లు రాణించాయి.