మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి

81చూసినవారు
మల్లన్న క్షేత్రంలో భక్తుల సందడి
కొమురవెల్లి మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఆదివారం విపరీతమైన ఎండలోనూ అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం కోనేరులో స్నానం చేసి, బోనాలతో ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. అనంతరం పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. రాజగోపురం, గంగరేణి చెట్టు వద్ద భక్తుల సందడి నెలకొంది. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని ఈవో బాలాజీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్