కొమురవెల్లి మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు ఆదివారం విపరీతమైన ఎండలోనూ అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం కోనేరులో స్నానం చేసి, బోనాలతో ఆలయానికి చేరుకొని నైవేద్యం సమర్పించారు. అనంతరం పట్నాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. రాజగోపురం, గంగరేణి చెట్టు వద్ద భక్తుల సందడి నెలకొంది. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పట్టిందని ఈవో బాలాజీ తెలిపారు.