పిడుగుపాటుకు పాడి పశువులు మృతి

57చూసినవారు
పిడుగుపాటుకు పాడి పశువులు మృతి
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో శనివారం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అయితే అదే సమయంలో భారీ శబ్దంతో పిడుగులు పడడంతో దాసరి నర్సింలు అనే రైతుకు చెందిన ఎద్దు అక్కడిక్కడే మృతి చెందింది. అలాగే సందీప్ రెడ్డి అనే దొమ్మాట రైతుకు సంబంధించిన పాడి ఆవు కూడా మృతి చెందింది. ఈ ఘటన చూసి గ్రామస్తులు కన్నీటి పర్యాంతమయ్యారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్