వరికి రూ. 500 బోనస్ అమలు చేయాలి

52చూసినవారు
వరికి రూ. 500 బోనస్ అమలు చేయాలి
నంగునూర్ మండల రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ సిద్దన్నపేట వ్యవసాయ మార్కెట్ లోని రైతులు గురువారం పోస్టుకార్డులు రాశారు. తమకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ వెంటనె ఇచ్చి రైతులను ఆదుకోవాలని, రైతు రుణమాఫీ రూ. 2లక్షలను వెంటనే రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేయాలని కోరారు. పెంచిన రైతు బంధు రూ. 15000 లను అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్