ఎంపీ బీబీ పాటిల్ వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు

54చూసినవారు
నార్సింగ్ మండలం జప్తి శివునూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వైపు నుంచి కామారెడ్డి వైపు వస్తున్న జహీరాబాద్ ఎంపీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ అతివేగంగా వచ్చి ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సంకాపూర్ గ్రామానికి చెందిన బోయిని యాదగిరి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా 108 సిబ్బంది రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్