చేగుంట మండల కేంద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగరాజు మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం నేపథ్యంలో నాగరాజును హత్య చేసినట్టు గుర్తించారు, మృతదేహాన్ని హైదరాబాద్ కూకట్పల్లి చెరువులో స్వాధీనం చేసుకున్న పోలీసులు. చేగుంటకు చెందిన వంగ సత్యనారాయణ, అతని బావమరిది మల్లేష్, సునీల్ గౌడ్ హత్య చేసినట్లు గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి మంగళవారం రిమాండ్కు తరలించారు.