ఎక్స్ రోడ్డును మాజీ ప్రధాని పీవీ చౌరస్తాగా మార్చాలి

50చూసినవారు
సిద్దిపేట జిల్లా కోహెడ నుంచి సముద్రాల రోడ్డు చౌరస్తాకు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు చౌరస్తాగా నామకరణం చేయాలని సామాజిక కార్యకర్త, పీవీ సేవాసమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు డిమాండ్ చేశారు. రామాయంపేట - ఎల్కతుర్తి జాతీయ రహదారి సముద్రాల ఎక్స్ రోడ్డు వద్ద కలుస్తుందని, ఆ చౌరస్తాకు పివి నరసింహారావు చౌరస్తాగా నామకరణం చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నంకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్