ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి చెందిన రణం లింగయ్య వయసు 41 సంవత్సరాలు సెంట్రింగ్ వృత్తి చేస్తూ జీవిస్తాడు. ఈ నెల 24వ తారీఖున సెంట్రింగ్ పని నిమిత్తం బెజ్జంకి వచ్చి తిరిగి తన యొక్క టీవీఎస్ ఎక్సెల్ వాహనం పై వెళుతుండగా గుండారం గ్రామ శివారులో గల ఆయిల్ ఫామ్ వద్ద బండి అదుపుతప్పి కింద పడగా అతని తలకు తీవ్రమైన గాయం కాగాహాస్పిటల్ తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం గాంధీ ఆసుపత్రిలో మరణించాడు.