వర్గల్ మండలంలోని గోవిందపూర్ గ్రామంలో తాళం వేసి ఉన్న రెండు ఇళ్లలో మంగళవారం రోజు రాత్రి దొంగలు చోరీకి పాల్పడినట్లు గౌరారం పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే గోవిందపూర్ గ్రామానికి చెందిన లింగ శ్రీనివాస్, మరియు కేసరి రామవ్వ ఇద్దరి ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇద్దరి ఇళ్లలో సుమారు 3 తులాల బంగారం, 118 తులాల వెండి చౌర్యానికి గురైనట్లు బాధితులు తెలిపారు.