రోడ్డు విస్తరణకు సానుకూలంగా స్పందించిన మంత్రి

78చూసినవారు
రోడ్డు విస్తరణకు సానుకూలంగా స్పందించిన మంత్రి
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని జగదేవ పూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి, పార్టీ నాయకులు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వట్టిపల్లి గ్రామం నుండి సాల్వాపూర్ వరకు డబుల్ రోడ్డు వేయించగలరని మంత్రికి వినతి పత్రం బుధవారం అందజేశారు. మంత్రి వెంటనే స్పందించి డబుల్ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్