కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం అందరూ కష్టపడి పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం కోహేడలోని శ్రీవేంకటేశ్వర గార్డెన్లో వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వారందరూ తిరిగి పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.