యువ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి

76చూసినవారు
యువ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి
మే 2న హుజురాబాద్ లో జరిగే కరీంనగర్ పార్లమెంట్ యువ సమ్మేళన కార్యక్రమానికి యువత పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని బీజేవైఎం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దుర్శెట్టి సంపత్ పిలుపునిచ్చారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బీజేవైఎం హుస్నాబాద్ నియోజకవర్గం సమావేశం నిర్వహించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగాలంటే కేంద్రంలో మోడీ కరీంనగర్ లో బండి సంజయ్ లను గెలిపించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్