అక్కన్నపేట దుర్గమ్మ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణం

61చూసినవారు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన దుర్గమ్మ ఆలయంలో మంగళవారం మహిళలు లలిత సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి మాట్లాడుతూ, ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో చల్లగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్